సుకుమార్‌ బ్యానర్‌లో 'దొరసాని'?

మరిన్ని వార్తలు

'దొరసాని'తో తెలుగు తెరకు పరిచయమవుతున్న ముద్దుగుమ్మ శివాత్మిక. రాజశేఖర్‌ - జీవిత దంపతుల చిన్న కుమార్తై ఈ శివాత్మిక. నిజానికి పెద్ద కూతురు శివాని ముందుగా హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తుందని భావించారు. '2 స్టేట్స్‌' సినిమాతో శివానీ తెరంగేట్రం జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నిర్మాణం ఆలస్యం కావడంతో, చెల్లెలు శివాత్మిక ఆరంగేట్రం షురూ అయ్యింది.

 

ఈమె నటించిన 'దొరసాని' మరి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన 'దొరసాని' టీజర్‌, ట్రైలర్‌లలో శివాత్మిక యాక్టింగ్‌ టాలెంట్‌ చూసిన దర్శక, నిర్మాతలు ఆమెతో తదుపరి ఒప్పందాలకు రంగం సిద్ధం చేస్తున్నారట. అందులో భాగంగా, ఓ బోల్డ్‌ మూవీ శివాత్మిక వద్దకు వచ్చిందనీ సమాచారమ్‌. ఆ సినిమా మరింకేదో కాదు, గత నాలుగేళ్ల క్రితం హెబ్బా పటేల్‌ హీరోయిన్‌గా వచ్చిన 'కుమారి 21 ఎఫ్‌' సీక్వెల్‌ అనీ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో కొత్త యువ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు. ఇప్పుడీయన శివాత్మిక కోసం ఈ సినిమాకి సీక్వెల్‌ స్క్రిప్టు రూపొందిస్తున్నారనీ తెలుస్తోంది.

 

ఈ స్క్రిప్టు ఫైనల్‌ అయితే, శివాత్మిక రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది. 'కుమారి 21 ఎఫ్‌' అప్పట్లో ఓ సంచలనం. హెబ్బా పటేల్‌కి యూత్‌లో క్రేజ్‌ తెచ్చి పెట్టిన సినిమా అది. 'దొరసాని'తో విడుదలకు ముందే శివాత్మిక సమ్‌థింగ్‌ ఎట్రాక్ట్‌ చేస్తోంది. అయితే 'దొరసాని'లో నటించిన శివాత్మిక, బోల్డ్‌ కంటెంట్‌ మూవీకి సై అంటుందా.? కెరీర్‌కి ఉపయోగపడే స్క్రిప్టు అయితే నో డౌట్‌ ఓకే అంటుంది. అయినా అక్కడున్నది సుకుమార్‌ కదా. ఒకవేళ ఛాన్సంటూ వస్తే, వదులుకునే ఛాన్సే లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS