అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్లో మరో గ్లామర్ యాడ్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాకి ఓ మామూలు కమర్షియల్ మూవీకి ఉన్న గ్లామర్కి పదింతలు రెట్టింపు గ్లామర్ ఉంది. పలువురు ప్రముఖ అందాల తారలు ఈ సినిమాలో ఏదో ఒక పాత్రతో మెరిసిపోనున్నారు. తాజాగా వారందరితో పాటు నేను కూడా ఉన్నానంటోంది తెలుగమ్మాయి ఈషా రెబ్బ. 'ఎన్టీఆర్' బయోపిక్లో ఈషా కూడా ఓ పాత్రలో నటించనుందనీ తాజాగా బయట ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ 'ఎన్టీఆర్' బయోపిక్లో ఎన్టీఆర్ సతీమణి 'బసవతారకం' పాత్ర పోషిస్తుండగా, రకుల్ ప్రీత్సింగ్, శ్రియ, నిత్యామీనన్ ఇలా తదితర ముద్దుగుమ్మలు నిడివి తక్కువే అయినా ఇతర కీలకపాత్రల్లో మెరవనుండగా, తాజాగా ఆ లిస్టులో మన తెలుగమ్మాయి ఈషా రెబ్బ పేరు కూడా వచ్చి చేరినట్లు తెలుస్తోంది. పాత్ర తక్కువే అయినా, ఈషాకు ప్రతిష్ఠాత్మక సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. మొన్నీ మధ్యనే యంగ్ టైగర్ ఎన్టీఆర్తో 'అరవింద సమేత..'లో నటించింది.
జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఇప్పుడు ఏకంగా నందమూరి నటసింహం బాలయ్య సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లే. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ బయోపిక్లో ఈషాకి ఏ భాగంలో నటించే ఛాన్స్ దక్కిందో ఇంకా తెలీదు. కానీ వెరీ కమింగ్ సూన్ అంటే రేపే ఈ బ్యూటీ 'సుబ్రహ్మణ్యపురం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమంత్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈషా రెబ్బ పూర్తి స్థాయి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.