'మంచివాడు'.. వాళ్ళిద్దరి మధ్యా నలిగిపోయాడు..

By Inkmantra - January 16, 2020 - 10:22 AM IST

మరిన్ని వార్తలు

నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహ్రీన్‌ కౌర్‌ జంటగా వచ్చిన సంక్రాంతి సినిమా 'ఎంత మంచివాడవురా', రెండు పెద్ద సినిమాల మధ్య నలిగిపోయింది. అవును, తొలి రోజు కొన్ని చోట్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ అయితే వచ్చినా.. చాలా చోట్ల ఈ సినిమా తేలిపోయింది. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' పోటా పోటీగా వసూళ్ళు సాధిస్తున్న వేళ, ఇంకో సినిమా గురించి ప్రేక్షకులు ఆలోచించడానికీ ఇష్టపడకపోవడం గమనార్హం. మరోపక్క, తొలి షో రిజల్ట్‌ తేలిపోవడంతో, 'ఎంత మంచివాడవురా' వైపు చూడలేకపోయారు ప్రేక్షకులు.

 

సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం విదితమే. భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ చేసినా.. అవేవీ థియేటర్లకు జనాన్ని రప్పించలేకపోతున్నట్లే కన్పిస్తోంది. కొన్ని చోట్ల మార్నింగ్‌ షో కూడా ఫుల్‌ అవలేదు. సాయంత్రానికి సినిమా పూర్తిగా డల్‌ అయిపోయేసరికి.. ఆ సినిమాని తీసేసి, 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' షోస్‌ వేయాలనే డిమాండ్లు వచ్చాయట. రెండో రోజు.. అంటే నేడు, ఈ సినిమా చాలా థియేటర్ల నుంచి ఔట్‌ అయిపోనుందనే చర్చ జరుగుతోంది. మరోపక్క, సంక్రాంతి సీజన్‌ కాబట్టి, పెద్దగా 'ఎంతమంచివాడవురా' సినిమాకి కొన్ని చోట్ల ఇబ్బంది వుండకపోవచ్చని అంటున్నారు. పండగ సీజన్‌ ముగిసేసరికి మళ్ళీ వీకెండ్‌ సీజన్‌ షురూ అవుతుంది గనుక.. ఈ రెండు మూడు రోజులు తట్టుకోగలిగితే 'ఎంతమంచివాడవురా' టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లను సాధించొచ్చేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS