ప‌వ‌న్ స్టార్ ని త‌క్కువ అంచ‌నా వేస్తున్నారా?

మరిన్ని వార్తలు

ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందు - స‌ర్వేలు హ‌డావుడి చేస్తున్నాయి. జాతీయ‌, ప్రాంతీయ టీవీ ఛాన‌ళ్లు, ల‌గ‌డ‌పాటి లాంటి రాజ‌కీయ జ్యోతిష్యులు `శాస్త్రీయ‌త‌` పేరుతో లెక్క‌లు క‌ట్టి మ‌రీ - అంకెలు చెప్పేస్తున్నారు. అయితే... ఏ స‌ర్వేలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన‌ని పట్టించుకున్న దాఖలాలు క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ పార్టీకి 0 నుంచి 3 స్థానాలు మాత్ర‌మే వ‌స్తాయ‌ని తేల్చేస్తున్నాయి. అంటే అత్య‌ధికంగా మూడు స్థానాలు గెల‌వొచ్చు.

 

ఒక్క స్థానంలోనూ గెల‌వ‌క‌పోవొచ్చు. ఇదీ... స‌ర్వేల సారాంశం. అయితే... ఓట్ల‌ని చీల్చ‌డంలో మాత్రం ప‌వ‌న్ స‌ఫ‌లీకృతుడ‌య్యాడ‌ని, ప‌ది శాతం ఓట్లు జ‌న‌సేన ఖాతాలోకి మ‌ళ్లాయ‌ని మాత్రం లెక్క‌గ‌డుతున్నారు. టీడీపీ - వైకాపా గెలుపు మ‌ధ్య అంత‌రం కూడా ఈ ప‌ది శాత‌మే కావ‌డం విశేషం. అంటే.. ప‌వ‌న్ సీట్లు గెల‌వ‌క‌పోయినా, ఓట్లు కొల్ల‌గొట్టి - అధికార పీఠంపై ఎవ‌రు కూర్చుంటార‌న్న‌ది డిసైడ్ చేస్తున్నాడ‌న్న‌మాట‌.

 

అయితే సర్వేల ప‌ట్ల ప‌వ‌న్ అభిమానులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. జ‌న‌సేన క‌నీసం 10 నుంచి 15 సీట్ల వ‌ర‌కూ గెలుచుకుంటుంద‌ని, ఒక పార్ల‌మెంటు స్థానాన్నీ కైవ‌సం చేసుకుంటుంన‌ద్న‌ది వాళ్ల వ్య‌క్తిగ‌త లెక్క‌. ఈ సర్వేలు కూడా మాయేన‌ని.. ప‌వ‌న్ స్టామినాని అంచ‌నా వేయ‌లేక‌పోయాయ‌ని 23న అస‌లు లెక్క‌లు తేల‌తాయ‌ని గ‌ట్టి విశ్వాసంతో చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS