ల‌గ‌డ‌పాటి చెప్పేశాడు: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎం.ఎల్‌.ఏ అవ్వ‌డం ఖాయం

మరిన్ని వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌కు మంచి క్రేజ్‌. ఆయ‌న స‌ర్వేలు దాదాపుగా నిజం అవుతుంటాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఆయ‌న చెప్పింది త‌ప్పింది గానీ, మిగిలిన అన్నిసార్లూ... ల‌గ‌డ‌పాటి స‌ర్వేలు నిజం అయ్యాయి. ఈసారి కూడా ఆయ‌న ముంద‌స్తుగానే జోస్యం చెప్పేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో హింట్ ఇచ్చారు. టీడీపీ అక్క‌డ గెలుపొంద‌డం ఖాయం అన్న‌ట్టు చెప్పేశారు.

 

అంతేకాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ భ‌విత‌వ్యం పై కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. ఈసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్ట‌డం ఖాయం అని జోస్యం చెప్పారు. భీమ‌వ‌రం, గాజువాక‌ల నుంచి ప‌వ‌న్ బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఈరెండు చోట్లా ప‌వ‌న్ గెలుస్తాడా? లేదా? అనే విష‌యంపై భారీ స్థాయిన చ‌ర్చ న‌డుస్తోంది. రెండు చోట్లా ప‌వ‌న్ గెలుస్తాడ‌ని కొంద‌రు, రెండు చోట్లా ఓడిపోతాడ‌ని కొంద‌రు చెప్పుకుంటున్నారు.

 

అయితే ఇప్పుడు ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో ప‌వ‌న్ గెలుస్తాడ‌ని చెప్ప‌డం ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఆనంద ప‌రిచే విష‌య‌మే. ప‌వ‌న్ సీట్ల విష‌యంలోనూ ప‌రోక్షంగా ఓ హింట్ ఇచ్చారు. అప్ప‌టి మెగాస్టార్ కంటే, ఇప్ప‌టి ప‌వ‌ర్ స్టార్‌కు త‌క్కువ సీట్లు వ‌స్తాయ‌ని జోస్యం చెప్పారు. అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం 18 స్థానాలు కైవ‌సం చేసుకుంది. అంటే ఈసారి జ‌న‌సేన‌కు అంత‌కంటే త‌క్కువ వ‌స్తాయ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS