100 కోట్ల క్లబ్‌లోకి 'గీత గోవిందం'

మరిన్ని వార్తలు

ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చి, రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోన్న చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రం విజయాన్ని ఆ చిత్ర యూనిట్టే ఊహించి ఉండదు. ఆ స్థాయిలో మంచి విజయం సాధించింది 'గీత గోవిందం'. ఈ విజయంతో హీరో విజయ్‌దేవరకొండ క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. తొలి రోజు నుండే రికార్డుల వర్షం కురిపించాడు. 

ఇంకా 'గీత గోవిందం' దూకుడు ఎక్కడా తగ్గట్లేదు. గీత గోవిందం ప్రదర్శితమవుతున్న ధియేటర్స్‌లో అక్కడక్కడా ఇంకా హౌస్‌ఫుల్స్‌ నమోదవుతుండడం విశేషం. విజయ్‌ దేవరకొండ స్టామినా ముందు ఇప్పట్లో మరో హీరో నిలవడం కష్టమే అనిపిస్తోంది. తెలుగు సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అయిపోయాడు. విజయ్‌ నటించిన 'అర్జున్‌రెడ్డి' సంచలనం కావడం, ఇప్పుడు 'గీత గోవిందం' అంతకు మించిన సంచలనం సృష్టిస్తుండడంతో యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ ధాటికి భయపడిపోతున్నారు. 

తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌తో కలిపి ఓవరాల్‌గా 100 కోట్లు గ్రాస్‌ని అందుకుంది 'గీత గోవిందం'. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటించింది. బన్నీ వాస్‌ నిర్మాణంలో అల్లు అరవింద్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 

ఇదిలా ఉంటే, నెక్స్ట్‌ రాబోతున్న సినిమాల్లో 'నర్తనశాల'పై ఓ మోస్తరు అంచనాలున్నాయి. నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన యామినీ భాస్కర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS