సినీ నటీనటులు తమ సినిమా కెరీర్ అనంతరం ఏదో ఒక బిజినెస్ లోకి అడుగుపెడుతుంటారు. అలాగే, నందమూరి హీరో తారకరత్న బంజారాహిల్స్ రోడ్ నెం.12లో 'డ్రైవ్ ఇన్ రెస్టారెంట్' నడుపుతున్నాడు. సజావుగా వ్యాపారం సాగుతున్న సమయంలో జిహెచ్ఎంసి అధికారుల నుంచి నోటీసులు రావటంతో రెస్టారెంట్ యాజమాన్యం ఖంగుతిన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో రెస్టారెంట్ నడుపుతున్నందుకు గాను దానిని కూల్చివేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న హీరో తారకరత్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో చర్చించారు. రాత్రి వేళల్లో మద్యం సేవించి, డీజే సౌండ్స్ తో ఇబ్బంది కలుగ చేస్తున్నారని.. ఎమ్మెల్యే కాలనీ లోని సొసైటీ సభ్యులు కంప్లైంట్ ఇవ్వటం వల్ల, ప్రభుత్వ ఆదేశం మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
దాంతో.. తనకి కొంత సమయం ఇవ్వమని కోరగా, అధికారులు 3 గంటల వ్యవధిని ఇచ్చారు. ప్రస్తుతం, తారకరత్న యాజమాన్యం తమ సామాన్లను వేరే ప్రాంతానికి తరలించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.