లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'ఆరమ్'(తెలుగులో కర్తవ్యం) తమిళనాట విజయం సాధించడంతో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈమధ్య నిర్మాతలు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని, అయితే సీక్వెల్ లో నయనతారకు బదులుగా కీర్తి సురేష్ ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. దీంతో నయనతార ఫ్యాన్స్ కొందరు అప్సెట్ అయ్యారట.
ఈ విషయంపై స్పందించిన దర్శకుడు గోపి నైనర్ అసలు సీక్వెల్ కోసం ప్రయత్నాలు చేయడం లేదని, ఈ సినిమాపై వస్తున్న వార్తలు అన్నీ పుకార్లేనని తేల్చి చెప్పారు. ఇప్పటికైతే సీక్వెల్ చేసే ఆలోచన లేదని, ఒకవేళ సీక్వెల్ చేస్తే మాత్రం తప్పనిసరిగా నయనతారతోనే చేస్తానని చెప్పాడు. 'ఆరమ్' సినిమాకు నయనతార మాత్రమే కరెక్ట్ గా సూట్ అవుతుందని కూడా చెప్పుకొచ్చారు.
'ఆరమ్' తర్వాత దర్శకుడు గోపి నైనర్ తమిళ హీరో జై తో 'కరుప్పర్ నగరం' ఒక సినిమాను మొదలు పెట్టారు కానీ ఆ సినిమా ఏమైందో తర్వాత అప్డేట్ రాలేదు. ఏదేమైనా నయనతార సినిమా సీక్వెల్ వార్తలతో ఒక్కసారిగా ఈ గోపి వార్తల్లోకి వచ్చారు.