తేజు ఔట్‌ గోపీచంద్‌ ఇన్‌

మరిన్ని వార్తలు

విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్‌ నుండి తేజు తప్పుకున్నాడనీ తాజా సమాచారమ్‌. ఆరడుగుల అందగాడు గోపీచంద్‌ చేతికి ఆ ప్రాజెక్ట్‌ చిక్కిందట. ప్రస్తుతం గోపీచంద్‌ 'పంతం' సినిమాతో నటిస్తున్నాడు. అందాల భామ మెహ్రీన్‌ కౌర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇకపోతే, తేజు వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ స్పెషల్‌ ప్రాజెక్ట్‌ని వదులుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. 'ఐతే', 'అనుకోకుండా ఒక రోజు' తదితర చిత్రాలతో విలక్షణ దర్శకునిగా గుర్తింపు పొందాడు చంద్రశేఖర్‌ ఏలేటి. గోపీచంద్‌తో ఆల్రెడీ 'ఒక్కడున్నాడు', 'సాహసం' వంటి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించాడీ దర్శకుడు. ముచ్చటగా మూడో సారి కూడా సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నాడట గోపీచంద్‌తో చంద్రశేఖర్‌ ఏలేటి. 

ఓ డిఫరెంట్‌ అండ్‌ మెస్మరైజింగ్‌ కాన్సెప్ట్‌ని ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నారట. సినిమా నిండా బోలెడన్ని సర్‌ప్రైజ్స్‌ ఉంటాయని తెలుస్తోంది. అతి త్వరలోఈ సినిమాని పట్టాలెక్కించే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి చంద్రశేఖర్‌ ఏలేటితో తేజునే తొలిసారి ఈ ప్రయోగాత్మక చిత్రంలో నటించాలనుకున్నాడట. 

కానీ అనుకోకుండా ఆ ప్రాజెక్ట్‌ నుండి తేజు తప్పుకున్నాడట. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ 'తేజ్‌ ఐ లవ్‌ యూ' చిత్రంలో నటిస్తున్నాడు. కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమా పరమేశ్వరన్‌, తేజుకి జోడీగా నటిస్తోంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS