గోపీచంద్‌ 'పంతం' టైమ్‌ స్టార్స్‌ నౌ.!

మరిన్ని వార్తలు

యాక్షన్‌ హీరో గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'పంతం' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గోపీచంద్‌కు 25వ చిత్రం. అలా అని కాకపోయినా, సినిమా స్టోరీ పరంగా బాగానే అంచనాలు నెలకొన్నాయి. 

పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ట్రైలర్‌లో చూపించిన పొలిటికల్‌ పంచ్‌ డైలాగులు ప్రేక్షకుల్ని ఆలోచింపచేయడంతో పాటు, బాగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. సో ఆ రకంగా ఈ సినిమాపై ఆశక్తి నెలకొందనే చెప్పాలి. అందాల భామ మెహ్రీన్‌ ఈ సినిమాలో గోపీచంద్‌కి జోడీగా నటిస్తోంది. కొత్త డైరెక్టర్‌ చక్రవర్తి ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. కొత్త డైరెక్టర్‌ అని తేలిగ్గా తీసి పారేయకూడదండోయ్‌. ఈయనలో చాలా విషయం ఉందట. అదేంటో 'పంతం' సినిమా చూస్తేనే అర్ధమువుతుందంటున్నారు. 

అలాగే కథను తాను ఎలా తెరకెక్కించాలనుకున్నాడో, అచ్చం అలాగే తెరకెక్కించాడు. ఎక్కడా రాజీపడలేదట. ఆయనలోని ఆ గట్స్‌ నచ్చే గోపీచంద్‌ ఈ సినిమా కథ విన్న వెంటనే ఓకే చేసేశాడట. పొలిటికల్‌ పంచ్‌లతో పాటు, కామెడీ, యాక్షన్‌ మిగిలిన అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయట. 'ఆక్సిజన్‌' డిజాస్టర్‌ తర్వాత గోపీచంద్‌ నుండి వస్తున్న చిత్రమే అయినా, ట్రైలర్‌తో నెలకొన్ని అంచనాలతో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ధియేటర్స్‌ వద్ద సందడి వాతావరణం బాగా నెలకొంది. 

చూడాలి కాస్సేపట్లో రిజల్ట్‌ తేలిపోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS