అధికారిక లాంచనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

మరిన్ని వార్తలు

ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీ నందమూరి హరికృష్ణ గారి అంత్యక్రియలకి సంబంధించిన వివరాలు ఇప్పుడే వెల్లడయ్యాయి.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి- ముందుగా అందరూ హరికృష్ణ గారి అంత్యక్రియలు మొయినాబాద్ లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కాకుండా హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరిపేందుకు కుటుంబసభ్యులు ఒక నిర్ణయానికి వచ్చారు.

రేపు మధ్యాహ్నం 2.30నిలకు మెహదిపట్నంలోని ఆయన నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభమై 3 గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తవుతాయి అని తెలుస్తుంది. ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హరికృష్ణ గారికి ప్రభుత్వ లాంచనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకి సూచన చేశారు.

ఇక రేపు కుటుంబసభ్యులు, అభిమానులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS