ఈ సర్టిఫికెట్‌ ఓకే. ఆ సర్టిఫికెట్‌ సంగతే.!

మరిన్ని వార్తలు

'అఖిల్‌', హలో' చిత్రాలు అఖిల్‌కి ఆశించిన రిజల్ట్‌ని అందించలేకపోయాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అక్కినేని అందగాడు అఖిల్‌. అఖిల్‌ నటించిన 'మిస్టర్‌ మజ్ను' తాజాగా సెన్సార్‌ బోర్డ్‌ నుండి యు బై ఏ సర్టిఫికెట్‌ అందుకుంది. యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సెన్సార్‌ బోర్డు ఒక్క కత్తెర కూడా వేయకుండా యు బై ఎ సర్టిఫికెట్‌ ఇచ్చేసింది. ఇక ఆడియన్స్‌ ఇచ్చే సర్టిఫికెట్‌ పైనే అఖిల్‌ భవితవ్యం ఆధారపడి ఉంది.

మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలతో బాగానే ఎట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అఖిల్‌. యూత్‌ మెయిన్‌ టార్గెట్‌గా ఈ సినిమా కథా, కథనాలు ఉన్నట్లు అర్ధమవుతోంది. యూత్‌ఫుల్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి యూత్‌ పల్స్‌ని పట్టేలా ఈ సినిమాని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాపై పోజిటివ్‌ వైబ్స్‌ కనిపిస్తున్నాయి.

ఇకపోతే హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్‌కి ఇది రెండో సినిమా. తొలి సినిమా 'సవ్యసాచి' నిరాశపరచినా, అమ్మడికి సోషల్‌ మీడియా ద్వారా బాగానే క్రేజ్‌ ఉండడంతో, ఆ క్రేజ్‌ ఈ సినిమాకి కలిసొస్తుందనిపిస్తోంది. తమన్‌ మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఫైనల్‌ వర్డిక్ట్‌ తెలియాలంటే ముచ్చటగా మూడు రోజులు ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS