వకీల్ సాబ్లో మిగిలిన తారాగణం అంతా ఓకే అయిపోయినా, పవన్ కల్యాణ్ ఫ్లాష్ బ్యాక్లో కనిపించే కథానాయిక ఎవరన్నది ఇంకా తేలలేదు. పింక్ కథని వకీల్ సాబ్గా మార్చేటప్పుడు పవన్ ఇమేజ్ని దర్శక నిర్మాతలు కాస్త గట్టిగానే దృష్టిలో పెట్టుకున్నారు. మార్పుల్లో పవన్ ఫ్లాష్ బ్యాక్ చాలా కీలకం. అందుకోసం ఓ కథానాయిక అవసరమైంది. ఆ పాత్ర కోసం చాలా పేర్లు పరిశీలించారు. చివరికి శ్రుతిహాసన్ పేరు ఖరారు చేశారన్న వార్తలొచ్చాయి. అదీ నిజమే అనుకున్నారంతా. కానీ ఇప్పటికీ శ్రుతి ఖరారు కాలేదని టాక్.
ఇప్పుడు లావణ్య త్రిపాఠీ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే పింక్ రీమేక్లో ఈ ఇద్దరూ లేరని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. కథానాయిక అన్వేషణ ఇంకా జరుగుతూనే ఉందని, ఇంకా ఓ కొలిక్కి రాలేదని, త్వరలోనే కథానాయిక పేరుని వెల్లడిస్తామని చిత్రబృందంలోకి కీలక సభ్యుడు చెప్పుకొచ్చాడు. సో.. దిల్ రాజు నాయిక వేట ఇంకా ముగిలేదన్నమాట.