'కొత్త బంగారు లోకం' సినిమాతో దిల్ రాజు బ్యానర్లో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు 'బ్రహ్మూెత్సవం' అట్టర్ ఫ్లాప్ రిజల్ట్నిచ్చి, కెరీర్ని డౌన్ ఫాల్లోకి నెట్టేసింది. దాంతో విషయమున్న ఈ దర్శకున్ని ఎవ్వరూ పట్టించుకోవడం మానేశారు. కానీ, నిర్మాతగా సురేష్ బాబు పెద్ద మనసే అనాలో, లేక ఈ కథని శ్రీకాంత్ అడ్డాల మాత్రమే డీల్ చేయగలడు అని హీరో వెంకటేష్ భావించాడో ఏమో కానీ, పిలిచి మరీ అవకాశమిచ్చాడు. తన కొత్త ప్రాజెక్ట్ అయిన 'నారప్ప'ను మారు ఆలోచించకుండా శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టేశాడు. ధనుష్ నటించిన తమిళ చిత్రానికి తెలుగు రీమేక్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
వెంకటేష్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్లుగా తెలుగులో చిన్నా చితకా మార్పులు చేస్తున్నారట. కానీ, దాదాపు కథలో కీలకమైన సన్నివేశాలన్నీ అచ్చు గుద్దినట్లుగా వెంకటేష్కి అతికిపోయినట్లుండడంతోనే ఈ సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు సురేష్ బాబు. మేకింగ్లో కొత్తదనం చూపించాల్సిన బాధ్యత మాత్రం శ్రీకాంత్ పైనే ఉంది. బడ్జెట్లో ఏమాత్రం రాజీ పడకుండా శ్రీకాంత్కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేశాడట సురేష్ బాబు. దాంతో సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తోందని ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఫ్లాప్ డైరెక్టర్ అనే ముద్రను చెరిపేసుకోవడానికి శ్రీకాంత్కి దొరికిన సదవకాశమిది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి శ్రీకాంత్ కూడా బాగా కష్టపడుతున్నాడట. చూడాలి మరి, తాను అనుకున్న సక్సెస్ని ఈ సినిమా అందిస్తుందో లేదో. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా సీనియర్ నటి ప్రియమణి నటిస్తోంది.