హాలీవుడ్-ఇండియన్ ప్రొడక్షన్ అయిన 'మోసగాళ్లు' సినిమా కోసం తనకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్రారంభించారు హీరో మంచు విష్ణు. ప్రపంచపు ఎంటర్టైన్మెంట్ రాజధానిగా ప్రసిద్ధిపొందిన లాస్ ఏంజెల్స్ (యు.ఎస్.)లో తీస్తున్న ఇంపార్టెంట్ సీన్లలో ఆయన పాల్గొంటున్నారు. నియాన్ లైట్లతో వెలిగిపోయే లాస్ ఏంజెల్స్ నగరం 'మోసగాళ్లు'కు సరిగ్గా సరిపోయే నేపథ్యాన్ని అందిస్తోందని చెప్పవచ్చు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఈ సినిమా ఛేదిస్తుంది.
ఈ లాస్ ఏంజెల్స్ షెడ్యూల్ 10 రోజుల పాటు జరుగుతుంది. ఇండస్ట్రీ వర్గాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ మూవీలో విష్ణుతో పాటు అందాల తార కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. కొద్ది నెలలుగా జరుగుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటోంది. సినిమాలో విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ చాలా ఇన్టెన్స్ గా ఉంటుందని మేకర్స్ తెలిపారు.