ఆర్‌ఎక్స్‌ కుర్రాడు ఈ సారీ తక్కువ చేసేలా లేడు!

మరిన్ని వార్తలు

'ఆర్‌ఎక్స్‌ 100' అంటూ అస్సలు అంచనాలే లేకుండా వచ్చి, బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల బాంబ్‌ పేల్చాడు యంగ్‌ హీరో కార్తికేయ. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో మనోడు వరుస అవకాశాల్ని లైన్‌లో పెట్టేశాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్నీ వాడేశామా.. క్యాష్‌ చేసుకున్నామా.. అన్నట్లుగా కాకుండా, కథల ఎంపికలో తెలివిగా వ్యవహరిస్తున్నాడు. కార్తికేయ నుండి రెండో సినిమాగా వస్తున్న 'హిప్పి' తొలి సినిమా సక్సెస్‌ కారణంగా ఓ మోస్తరు అంచనాల్ని నమోదు చేస్తోంది. అయితే 'ఆర్‌ఎక్స్‌'లో మాదిరిగానే మనోడు 'హిప్పీ'లోనూ రొమాంటిక్‌ అప్పీల్‌ని మాత్రం మిస్‌ చేసుకోలేదు.

 

'ఆర్‌ఎక్స్‌'లో ఒక్క ముద్దుగుమ్మతోనే ముద్దూ ముచ్చటా తీర్చుకుంటే, ఇప్పుడు 'హిప్పి'కి మాత్రం ఇద్దరు ముద్దుగుమ్మల్ని వెంటేసుకొస్తున్నాడు. మెయిన్‌ హీరోయిన్‌గా దిగంగనా సూర్యవంశీ నటిస్తుండగా, జజ్బా సింగ్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మొన్నామధ్య 'హిప్పి'కి సంబంధించి శాంపిల్‌గా ఓ టీజర్‌ని వదిలి, కుర్రోళ్ల సహనానికి పరీక్ష పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్‌ వదిలారు. ట్రైలర్‌తో కుర్రోళ్లను మరింత ఉగ్గబట్టుకునేలా చేశారు. కుర్రోళ్లకు కావల్సిన రొమాంటిక్‌ సీన్లను పుష్కలంగా జోడించి, హీరోయిజం ఎలివేట్‌ అయ్యేలా యాక్షన్‌ సీన్స్‌నీ బాగా దట్టించి ట్రైలర్‌ని కలర్‌ఫుల్‌గా నింపేశారు.

 

సీనియర్‌ నటుడు జె.డి.చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. హీరోకి గురు పాత్రలో కనిపిస్తున్నాడు జె.డి.చక్రవర్తి. ఇకపోతే ఈ సమ్మర్‌లోనే 'హిప్పీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి మనోడు 'హిప్పీ'తో సమ్మర్‌ హీట్‌ని తగ్గిస్తాడో.. లేక మరింత పెంచేస్తాడో.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS