రాక్ స్టార్ అంటూ దేవిశ్రీ ప్రసాద్కి మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరుంది. అయితే, ‘అల వైకుంఠపురములో..’ మ్యూజిక్తో థమన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ ఏడాది ఒకేసారి రిలీజైన ‘సరిలేరు..’, ‘అల వైకుంఠపురములో..’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లకే కాక, మ్యూజిక్లోనూ గట్టిగా పోటీ పడ్డాయి. కానీ, ఆ పోటీలో విజయం థమన్దే అని తేల్చేశారు. దాన్ని స్పోర్టివ్గా తీసుకున్న దేవిశ్రీ ప్రసాద్, తాజాగా ‘ఉప్పెన’ సినిమాకి కసిగా మ్యూజిక్ ఇచ్చాడు. ‘ఉప్పెన’ నుండి రిలీజైన రెండు పాటలూ రికార్డులు కొల్లగొడుతున్నాయ్ . సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ ఎంత అస్సెట్ కానుందనేది, ఇంతవరకూ రిలీజైన రెండు పాటల ద్వారా మాట్లాడుకునేలా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు ఏ కాలర్ ట్యూన్ విన్నా, ఎక్కడ చూసినా ‘నీ కన్ను నీలి సముద్రం.. అందుట్లో న మనసు పడవ ప్రయాణం..’ అని ఓ వైపు. ‘ధక్ ధక్..’ అంటూ గుండె ఝల్లుమనే మ్యూజిక్ మరో వైపు మార్మోగిపోతున్నాయి.
రెగ్యులర్ స్టైల్ మ్యూజిక్ కాకుండా, డిఫరెంట్ స్టైల్లో మ్యూజిక్ అందించి మెస్మరైజ్ చేశాడు రాక్ స్టార్. దాంతో ‘ఉప్పెన’ ముందు ‘అల..’ కొట్టుకెళ్లిపోయిందే..’ అనేంతలా ‘ఉప్పెన’లోని పాటలు అలరిస్తున్నాయి. ఇక, ముందు ముందు రానున్న మిగిలిన సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో కానీ, ఈ రెండు పాటలైతే, దుమ్ము దులిపేస్తున్నాయిలే. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా తెరకెక్కుతోన్న ‘ఉప్పెన’కు సుకుమార్ కథ, స్క్రీన్ప్లే అందించగా, ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీస్తో కలిసి సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.