బాలీవుడ్ కి వెళ్ళబోతున్న మరో హిట్ సినిమా !

మరిన్ని వార్తలు

ప్రస్తుతం బాలీవుడ్ నిర్మాతల చూపు టాలీవుడ్ సినిమాల పై పడింది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు బాగా ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన 'జెర్సీ, ఆర్ఎక్స్100', ఎవడు సినిమాల రైట్స్ ను కొనేశారు. అలాగే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

మరొక తెలుగు సినిమాని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం కూడా రీమేక్ అవుతుందట. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఈ చిత్రం రెట్టింపు లాభాలనుసొంతం చేసుకుంది. మొత్తానికి, ఇస్మార్ట్ శంకర్ పూరికి మరియు హీరో రామ్ కి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది, మరి రణబీర్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో చూడాలి. మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట.

 

అలాగే ఓ బేబీ కూడా రీమేక్ కానుందట. నిజానికి ఓ బేబీ సౌత్ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'. ఈ సినిమాని తెలుగులో 'ఓ బేబీ' పేరుతో రీమేక్ చేశారు సమంత. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందుకే హిందీలోకి కూడా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. సమంత చేసిన పాత్రలో అలియా భట్ ను ఫైనల్ చేశారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS