రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించారు. లేటెస్ట్గా అందుతోన్న సమాచారమ్ ప్రకారం 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయింది. అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ, సినిమా సూపర్ హిట్ ఖాయమనీ చిత్రయూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.
మామూలుగా అయితే, సినిమాలకు నిర్మాణం పూర్తయ్యాకే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. కానీ, 'ఇస్మార్ట్ శంకర్'ని తొలి రోజు షూటింగ్ నుండీ, వినూత్నంగా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడే సినిమాకి సంబంధించిన అప్డేట్ అందిస్తూ, సినిమాకి రావల్సిన హైప్ క్రియేట్ చేశారు. ఇక హీరోయిన్ల విషయమైతే, మాటల్లేవ్. మాట్లాడుకోవడాల్లేవ్ అనే రేంజ్లో గ్లామర్ పబ్లిసిటీ చేయించారు. హీరోయిన్స్పై చిత్రీకరించిన ప్రతీ సాంగ్, ప్రతీ సీన్ చాలా రొమాంటిక్గా ఉండనున్నాయనీ ప్రచార చిత్రాల ద్వారా చెప్పకనే చెప్పేసింది 'ఇస్మార్ట్ టీమ్'.
మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉంది. అంతేకాదు, ఈ సినిమాతో మణిశర్మ కూడా బౌన్స్ బ్యాక్ అవ్వనున్నారనిపిస్తోంది. ఆయన మెలోడీ చెవులకు అంత సొంపుగా ఉంది మరి. ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు మ్యూజిక్ ప్రియుల్ని అలరిస్తున్నాయి. ఆ మ్యూజిక్కి విజువల్గా పూరీ ఇచ్చిన టేకింగ్, హీరోయిన్స్ ఓవర్ డోస్ గ్లామర్ అన్నీ వెరసి 'ఇస్మార్ట్ శంకర్'కి మస్త్ రొమాంటిక్ హిట్ కట్టబెట్టేలానే ఉన్నాయి. జూలై 18న ఇస్మార్ట్గా 'ఇస్మార్ట్ శంకర్' ప్రేక్షకుల ముందుకు రానుంది.