అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ తక్కువదేం కాదండోయ్. తొలి సినిమాకే పర్ఫామెన్స్తో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఎంచుకునే సినిమాల కోసం, ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటోంది. ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు జాన్వీ చేతిలో ఉన్నాయి. అన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే కావడం విశేషం. వాటిలో తొలి భారతీయ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ అత్యంత కీలకమైనది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, తాజాగా జాన్వీ కపూర్ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'అర్జున్ రెడ్డి', 'జోకర్' సినిమాలు ఇటీవల బాలీవుడ్లో మంచి విజయాలందుకున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రలకు లేడీ వెర్షన్స్ కూడా రావాలని జాన్వీ కోరింది. హీరో పాత్రలకు ధీటుగా హీరోయిన్ పాత్రలను కూడా డిజైన్ చేయాలని జాన్వీ కపూర్ చెప్పింది. అలాంటి పాత్రల్లో నటించేందుకు తాను సిద్ధమే అని సంకేతాలిచ్చింది కూడా. స్క్రీన్పై ఇంతవరకూ జాన్వీకి అందాలారబోసే అవకాశం రానప్పటికీ, బహిరంగ వేడుకల్లో జాన్వీ డ్రెస్సింగ్ సెన్స్కి పిచ్చ ఫాలోయింగ్ ఉంది.
పాత్రల పరంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలే దక్కుతున్నప్పటికీ, ఎలాంటి కమర్షియల్ పాత్రలోనైనా నటించి మెప్పించగలదనీ, ఎక్స్పోజింగ్ విషయంలోనూ జాన్వీకి ఎలాంటి మొహమాటాల్లేవనీ ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ చూస్తే అర్ధమైపోతుంది. ఇటు కమర్షియల్ అయినా, అటు విలక్షణం అయినా ఎలాంటి స్టోరీ అయినా, జాన్వీ నుండి బెస్ట్ అవుట్ పుట్ రప్పించడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్, సౌత్ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి.