పెద్ద మనసు చాటుకున్న మెగా మేనల్లుడు

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తేజు ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. సహజంగానే సోషల్‌ సర్వీస్‌లో ఎప్పుడూ ముందుంటాడీ మెగా హీరో. అయితే ఈ సారి ఇంకొంచెం ముందుడుగు వేశాడు. సామాజిక సేవలో మరో మెట్టు ఎక్కాడు. ఓ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాడు. మధ్యలో ఆగిపోయిన ఓ వృద్ధాశ్రమాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాడు.

 

గతంలో ఓ వృద్ధాశ్రమం వాళ్లు తమ ఆశ్రమానికి సాయం చేయమని తేజుని ట్యాగ్‌ చేసి, ట్విట్టర్‌ ద్వారా కోరారట. ఆ విషయాన్ని ప్రస్థావిస్తూ, ఓ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు తేజు. 'ఆ వృద్ధాశ్రమాన్ని పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నా.. అందుకు మీ సాయం కూడా కావాలి అంటూ ట్విట్టర్‌ ద్వారా ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేశాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా భారీ ఖర్చులు పెట్టి ఫ్లెక్సీలు పెట్టొద్దనీ, వాటికి అయ్యే ఖర్చు తనకిస్తే, ఆ సొమ్మును ఆ వృద్ధాశ్రమం కోసం ఖర్చు చేస్తానని తేజు కోరడంతో, అభిమానులు ముందుకొచ్చి, విరాళాలు సేకరించారట.

 

దాదాపు లక్ష రూపాయల వరకూ విరాళాలు అందాయని, ఆ స్థాయిలో విరాళాలు అందించిన ఫ్యాన్స్‌కి ఈ సందర్భంగా తేజు థాంక్స్‌ చెప్పారు. ఇక త్వరలోనే ఆ వృద్ధాశ్రమాన్ని పూర్తి చేస్తాననీ, ఒక ఏడాది పాటు, ఆశ్రమం నడవడానికి అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని తేజు చెప్పాడు. తేజు తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆలోచింపచేస్తోంది. బర్త్‌డే విషెస్‌తో పాటు, పెద్ద మనసు చాటుకున్న తేజుకి ప్రముఖుల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. త్వరలో 'ప్రతిరోజూ పండగే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు తేజు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS