ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ ధమాకా!

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ తాజా చిత్రం 'జై లవకుశ'. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ రోల్‌ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కళ్యాణ్‌రామ్‌ నిర్మాణంలో ఎన్టీఆర్‌ తొలిసారిగా నటిస్తున్న సినిమా ఇది. బాబీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా ఎన్టీఆర్‌ ఈ సినిమాని సెప్టెంబర్‌ 21న విడుదల చేయాలనుకుంటున్నారట. జూలై ఫస్ట్‌ వీక్‌లో ఈ సినిమా టీజర్‌ రానుంది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ మూడు గెటప్స్‌నీ రివీల్‌ చేయనున్నారట. ఈ మూడు గెటప్స్‌లోనూ ఓ గెటప్‌ నెగిటివ్‌ రోల్‌ అని ప్రచారం జరుగుతోంది. నెగిటివ్‌ షేడ్స్‌లో ఆల్రెడీ ఎన్టీఆర్‌ని 'టెంపర్‌' సినిమాలో చూశాం. అంతకు మించిన పవర్‌ ఫుల్‌ నెగిటివ్‌ షేడ్స్‌ని ఎన్టీఆర్‌ ఈ సినిమా ద్వారా చూపించనున్నారట. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. అన్నట్లు సెప్టెంబరు 29న బాలయ్య హీరోగా తెరకెక్కుతోన్న 'పైసా వసూల్‌' సినిమా విడుదల కానుంది. బాబాయ్‌ కంటే అబ్బాయి వారం రోజుల ముందుగానే అభిమానులను అలరించనున్నాడు. దసరా సెలవులు కారణంగా ఈ బాబాయ్‌, అబ్బాయిలు ఇద్దరూ పోటీ పడనున్నారు. 'పైసా వసూల్‌' టైటిల్‌తో బాలయ్య, 'జై లవకుశ' అంటే ఎన్టీఆర్‌ నువ్వా నేనా అనే రేంజ్‌లో పోటీ పడనున్నారు ఈ ఇద్దరు నందమూరి నట సింహాలు. మరి ఈ ఇద్దరిలో ఎవరెంత పైసల్‌ వసూల్‌ చేస్తారో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS