సోషల్‌ మీడియాపై జాన్వీ కామెంట్‌.!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడి నుండి ఎక్కడికైనా వార్తలు ఇట్టే స్ప్రెడ్‌ అయిపోతున్నాయి. ఎలాంటి భావాన్నైనా ఈజీగా ఎక్స్‌ప్రెస్‌ చేసే ఫ్రీడమ్‌ సోషల్‌ మీడియా ద్వారా దక్కింది. అయితే మంచీ చెడూ రెండూ పక్క పక్కనే ఉంటాయి కదా అలాగే సోషల్‌ మీడియా ద్వారా జరిగే లాభ నష్టాలు రెండూ ఈక్వెల్‌గానే ఉంటున్నాయి. ఈ విషయమై అతిలోకసుందరి కుమార్తె జాన్వీకపూర్‌ లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలిపింది. 

 

సోషల్‌ మీడియాలో నెటిజన్లు వేసే కామెంట్స్‌ తననెంతో బాధిస్తున్నాయనీ, తన లైఫ్‌స్టైల్‌ని కామెంట్‌ చేస్తూ వారు పెట్టే పోస్ట్‌లు మనసుకు గాయం చేస్తున్నాయనీ ఈ రకమైన సమస్యలు సృష్టిస్తున్నవారిని శిక్షించలేకపోవడం బాధాకరమనీ జాన్వీ తెలిపింది. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ రెండు ప్రతిష్ఠాత్మక సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి 'తఖ్త్‌' అనే పీరియాడిక్‌ మూవీ కాగా, మరోటి తొలి భారతీయ మహిళా పైలెట్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌.

 

ఈ రెండు సినిమాలూ పరఫామెన్స్‌కి స్కోప్‌ ఉన్నవే కావడం విశేషం. 'ధడక్‌' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన జాన్వీ యాక్టింగ్‌ పర్‌ఫామెన్స్‌ మెచ్చిన బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆమెకు వేసిన వందకు వంద మార్కులే తదుపరి ఇలాంటి ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో అవకాశం కల్పించేలా చేసింది. ఈ సినిమాలతో జాన్వీ తన టాలెంట్‌ని మరోసారి ఎలా ప్రూవ్‌ చేసుకోనుందో చూడాలి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS