'మామ్‌'కి జాన్వీ కపూర్‌ స్పెషల్‌ బర్త్‌డే ట్రీట్‌!

మరిన్ని వార్తలు

అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది దుబాయ్‌ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో బాత్‌ టబ్‌లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ రోజు అతిలోక సుందరి శ్రీదేవి 54వ జయంతి కావడంతో ఆమెను తలచుకుంటూ, పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. కూతురు జాన్వీ కపూర్‌ అమ్మ శ్రీదేవిని తలచుకుంటూ, 'హ్యాపీ బర్త్‌డే మామ్‌, ఐ లవ్‌ యూ మామ్‌..' అంటూ శ్రీదేవి నటించిన చివరి చిత్రం 'మామ్‌'లోని ఫోటోని పోస్ట్‌ చేసింది.

 

ఇంతే కాదు, శ్రీదేవి జీవించి ఉన్నప్పుడు, ఆమె ప్రతీ పుట్టినరోజుకూ క్రమం తప్పకుండా, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన నిమిత్తం ప్రత్యేకంగా ఫ్యామిలీతో సమయాన్ని కేటాయించేదట. కానీ, ఈ ఏడాది ఆమె జీవించి లేరు. అయినప్పటికీ ఆ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా, కొనసాగించింది జాన్వీ కపూర్‌. ఈ రోజు తిరుమల చేరుకుని, స్వామి వారి దర్శనం చేసుకుంది.

 

ట్రెడిషనల్‌గా లంగా వోణీ ధరించి, అసలు సిసలు తెలుగమ్మాయిలా దర్శనమిచ్చింది. ఎక్కువగా చిట్టి పొట్టి డ్రస్సుల్లో, టైట్‌ ఫిట్స్‌, జిమ్‌ వేర్‌లో కనిపించే జాన్వీని ఇంత ట్రెడిషనల్‌ లుక్‌లో చూసిన అభిమానులు తెగ ముచ్చట పడిపోయారు. నిజంగానే జాన్వీ 'జూనియర్‌ అతిలోక సుందరి..' అంటూ అభివర్ణిస్తున్నారు. ట్రెడిషనల్‌ వేర్‌లో జాన్వీ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS