జాన్వీ సౌత్‌ ఎంట్రీ ఎవరితోనంటే.!

మరిన్ని వార్తలు

అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఆల్రెడీ తెరంగేట్రం చేసేసింది. తల్లి శ్రీదేవి జీవించి ఉంటే, తెలుగులో కూడా జాన్వీ ఎంట్రీకి ఈపాటికే సన్నాహాలు మొదలై ఉండేవి. అయితే ఆమె జీవించి లేని కారణంగా జాన్వీ కపూర్‌ సౌత్‌ ఎంట్రీపై పలు అనుమానాలున్న మాట వాస్తవమే. 

శ్రీదేవికి తెలుగులో ఉన్న క్రేజ్‌ని బట్టి, ఆమె కూతురు జాన్వీకపూర్‌ని కూడా తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో కొందరు తెలుగు దర్శక, నిర్మాతలున్నారు. అలాగే తమిళంలోనూ శ్రీదేవి మంచి నటి అనిపించుకున్నారు. ఆ కోవలోనే జాన్వీకి తమిళ నాట నుండి కూడా అవకాశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా ఓ సినిమా రూపొందనుంది. 'మానాడు' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమాలో శింబు సరసన నటించే ముద్దుగుమ్మ ఎవరనే స్థానంలో జాన్వీకపూర్‌ పేరు పరిశీలనలో ఉందట. 

దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ సినిమాలో జాన్వీని హీరోయిన్‌గా ఎంచుకునే యోచనలో ఉన్నారనీ కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. బాలీవుడ్‌లో జాన్వీ తొలి సినిమా 'ధడక్‌'లో ఆమె నటన చూశాక, ఈ సినిమాలో కథానాయిక పాత్రకు ఆమె అయితే బావుంటుందని వెంకట్‌ ప్రభు భావిస్తున్నారట. అయితే జాన్వీ తన తదుపరి చిత్రం తండ్రి బోనీ కపూర్‌ నిర్మాణంలో ఉండబోతోందని ఆల్రెడీ స్పష్టం చేసింది. 

చూడాలి మరి, ఈ స్పష్టతలో ఏమైనా తికమకలు జరిగి, జాన్వీ కపూర్‌ ఈ సినిమాతో సౌత్‌లో ఎంట్రీ ఇవ్వనుందేమో.!
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS