విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీల అమలులో విఫలమైన కేంద్రప్రభుత్వ వైఖరిని జనానికి తెలియపరిచే నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం లోక్సభలో చేపట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించారు. ఈ చర్చలో భాగంగా గల్లా జయదేవ్ మాట 'భరత్ అనే నేను' సినిమా ప్రస్థావన వచ్చింది.
ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన మహేష్బాబు చెప్పే ఓ డైలాగ్ ఉంటుంది. ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోకపోతే మగాడే కాడు అనే డైలాగ్ని ఆయన ప్రస్థావించారు. అంటే ఆ డైలాగ్లోని డెప్త్ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవాలి. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది అని గళ్లా జయదేవ్ అన్నారు.
' భరత్ అనే నేను' సినిమా ప్రమోషన్స్ని విజయవాడలో ఘనంగా నిర్వహించినప్పుడు ఆ ప్రమోషన్ కార్యక్రమాల్లో జయదేవ్ కూడా పాల్గొన్నారు. వాస్తవానికి గల్లా జయదేవ్, మహేష్కి బావ అయినప్పటికీ, సినిమాలో సోల్ని బట్టి ఆయనకు ఆ సినిమా ఎంతో బాగా నచ్చేసిందట. అలాగే 'బాహుబలి' సినిమా ప్రస్థావన కూడా లోక్సభలో చర్చకు తీసుకొచ్చారు గల్లా జయదేవ్. ఆ సినిమాకి వచ్చిన వసూళ్ల సంఖ్యంత కూడా లేదు ఆంధ్రప్రదేశ్కి మీరిచ్చిన నిధుల సంఖ్య అని ప్రధాని మోడీని నిలదీశారు.
ఇలా అవిశ్వాస తీర్మానం చర్చలో రాజకీయాలతో పాటు, సినిమాల ప్రస్థావనతోనూ వాడీ వేడీగా చర్చించారు ఎంపీ గల్లా జయదేవ్.