పార్లమెంట్‌లో 'భరత్‌ అనే నేను'

మరిన్ని వార్తలు

విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీల అమలులో విఫలమైన కేంద్రప్రభుత్వ వైఖరిని జనానికి తెలియపరిచే నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం లోక్‌సభలో చేపట్టిన అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ చర్చను ప్రారంభించారు. ఈ చర్చలో భాగంగా గల్లా జయదేవ్‌ మాట 'భరత్‌ అనే నేను' సినిమా ప్రస్థావన వచ్చింది. 

ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన మహేష్‌బాబు చెప్పే ఓ డైలాగ్‌ ఉంటుంది. ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోకపోతే మగాడే కాడు అనే డైలాగ్‌ని ఆయన ప్రస్థావించారు. అంటే ఆ డైలాగ్‌లోని డెప్త్‌ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవాలి. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్‌ అయ్యింది అని గళ్లా జయదేవ్‌ అన్నారు.

' భరత్‌ అనే నేను' సినిమా ప్రమోషన్స్‌ని విజయవాడలో ఘనంగా నిర్వహించినప్పుడు ఆ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జయదేవ్‌ కూడా పాల్గొన్నారు. వాస్తవానికి గల్లా జయదేవ్‌, మహేష్‌కి బావ అయినప్పటికీ, సినిమాలో సోల్‌ని బట్టి ఆయనకు ఆ సినిమా ఎంతో బాగా నచ్చేసిందట. అలాగే 'బాహుబలి' సినిమా ప్రస్థావన కూడా లోక్‌సభలో చర్చకు తీసుకొచ్చారు గల్లా జయదేవ్‌. ఆ సినిమాకి వచ్చిన వసూళ్ల సంఖ్యంత కూడా లేదు ఆంధ్రప్రదేశ్‌కి మీరిచ్చిన నిధుల సంఖ్య అని ప్రధాని మోడీని నిలదీశారు. 

ఇలా అవిశ్వాస తీర్మానం చర్చలో రాజకీయాలతో పాటు, సినిమాల ప్రస్థావనతోనూ వాడీ వేడీగా చర్చించారు ఎంపీ గల్లా జయదేవ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS