'ఫైటర్‌' కోసం అతిలోక సుందరి ఎంట్రీ ఇస్తుందా?

మరిన్ని వార్తలు

అతిలోక సుందరి కుమార్తై జాన్వీ కపూర్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసేందుకు డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండ సినిమాతో జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీ అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాధ్‌ కాంబినేషన్‌ అయితే సెట్టయిపోయింది. అంటే ప్రాబ్లెమ్‌ దాదాపు సగం క్లియర్‌ అయిపోయింది. ఈ ఇద్దరే జాన్వీని తెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఎలాగూ ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు.

 

ఇక జాన్వీని కదపడమే తరువాయి. జాన్వీని తెలుగులోకి తీసుకురావాలంటే, ఓ మంచి కథ, స్క్రీన్‌ప్లే సిద్ధం కావాలి. ఆమె పాత్రకు తగ్గ ఇంపార్టెన్స్‌ కూడా ఉండాలి. 'ధడక్‌' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, ప్రస్తుతం అన్నీ పర్‌ఫామెన్స్‌కి స్కోపున్న కథల్నే ఎంచుకుంటోంది. ఆమె చేతిలో అలాంటి కథలు ఇప్పుడు బాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి విజయ్‌ దేవరకొండ సరసన నటించేందుకు టాలీవుడ్‌కి వస్తుందా.? ఒకవేళ వస్తే, ఆ కథ, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి. తన పాత్ర ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉండాలి.? ఇవన్నీ సెట్‌ అవ్వాలంటే, విజయ్‌ కోసం పూరీ ఎంచుకున్న కంటెంట్‌లోనే అసలు విషయం ఉండాలి.

 

'ఫైటర్‌' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ కాంబో మూవీని మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రధానాంశంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి, మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందబోయే ఈ సినిమాతో పూరీ, జాన్వీని టాలీవుడ్‌కి తీసుకురాగలడా.? ప్రస్తుతం కొడుకు ఆకాష్‌ పూరీతో 'రొమాంటిక్‌' చిత్ర పనుల్లో పూరీ, 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమాతో విజయ్‌ దేవరకొండ బిజీగా ఉన్నారు. వీరిద్దరూ తమ తమ సినిమాల్ని పూర్తి చేసుకుని జనవరిలో 'ఫైటర్‌' పట్టాలెక్కించే యోచన చేస్తున్నారట. అంతవరకూ లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS