ఛాలెంజింగ్‌ రోల్‌లో అతిలోక సుందరి కూతురు

మరిన్ని వార్తలు

'ధడక్‌' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తై జాన్వీకపూర్‌. తొలి సినిమా అయినా ఎక్కడా బెరుకు కనిపించలేదు. నటిగా మంచి మార్కులు వేయించుకుంది. తొలి సినిమాకే 100 కోట్లు క్లబ్‌లోకి చేరిపోయింది ఈ సినిమాతో వసూళ్ల పరంగా జాన్వీ. అలా తల్లికి తగ్గ తనయ అని జాన్వి గురించి అంతా చెప్పుకున్నారు ఆ సినిమాతో. దాంతో నటిగా తనమీద బాధ్యత మరింత పెరిగిందని భావించిన జాన్వీకపూర్‌ విలక్షణ చిత్రాల ఎంపికపై దృష్టి పెట్టింది. 

తొలి మహిళా ఐఏఎఫ్‌ ఫైలట్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌లో జాన్వీ నటించనుందని బాలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. ఈ సినిమాలో జాన్వీతో పాటు భారీ తారాగణం నటిస్తోంది. కానీ జాన్వీ లీడ్‌ రోల్‌ పోషించనుందనీ తెలుస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌, అలియాభట్‌, కరీనాకపూర్‌, భూమి పడ్నేకర్‌ తదితర తారాగణం ఈ సినిమాలో నటిస్తుండగా, జాన్వీ కపూర్‌కి టైటిల్‌ రోల్‌ దక్కిందంటే నిజంగా అదృష్టమే. జాన్వీ తొలి సినిమాని రూపొందించిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌జోహార్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో గుంజన్‌తో జాన్వీ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ గుంజన్‌. ఇలాంటి గొప్ప వ్యక్తి పాత్రలో నటించే అవకాశం రెండో సినిమాకే తనకి దక్కినందుకు చాలా చాలా సంతోషంగా ఉందనీ, అంతకు మించి ఇలాంటి పాత్రలో నటించడమంటే పెద్ద బాధ్యతతో కూడుకున్నదనీ, ఆ బాధ్యతను నెరవేర్చుకునే దిశగా పూర్తి ఎఫర్ట్‌ పెడతానని జాన్వీ చెబుతోంది. 

వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నుండి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS