శ్రీదేవి కూతురు టాలీవుడ్‌కి 'నో' చెప్పేసింది

మరిన్ని వార్తలు

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌, తెలుగులో రామ్‌చరణ్‌ సరసన ఓ సినిమాలో నటించబోతోందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వచ్చింది. అదంతా ఉత్తదేనని తేలిపోయింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన జాన్వీతో నటింపజేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఈ మధ్యనే, టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండతో జాన్వీ కపూర్‌ నటించబోతోందనే గాసిప్స్‌ వచ్చాయి. 

అయితే తెలుగులో ఇప్పట్లో సినిమా చేసే అవకాశమే లేదని జాన్వీ పూర్‌ తేల్చేసింది. బాలీవుడ్‌లో కొన్ని కమిట్‌మెంట్స్‌ వున్నాయనీ, అమ్మ శ్రీదేవి జీవించి వున్నప్పుడే తన కెరీర్‌ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసిందనీ, దాంతో ఆ కమిట్‌మెంట్స్‌ కంప్లీట్‌ చేసేవరకు బాలీవుడ్‌ని వదిలి ఇంకో సినీ పరిశ్రమలో ఎలాంటి సినిమాలూ చేసే అవకాశం లేదని జాన్వీ కపూర్‌ చెప్పేసింది. దాంతో తెలుగు సినీ పరిశ్రమలో శ్రీదేవి అభిమానులు చాలా డిజప్పాయింట్‌ అవుతున్నారు. 

శ్రీదేవికి స్టార్‌డమ్‌ రావడానికి కారణం తెలుగు సినిమాలే. ఎప్పుడూ తెలుగు సినిమాల గురించి శ్రీదేవి గొప్పగా చెబుతుండేది. పలు తెలుగు సినిమా ఈవెంట్స్‌లోనూ శ్రీదేవి పాల్గొనేది. శ్రీదేవి మాత్రమే కాదు, ఆమె భర్త బోనీ కపూర్‌ కూడా తెలుగు సినిమాల పట్ల మక్కువ చూపేవారు. బోనీ కపూర్‌కి తెలుగులో చాలామంది సన్నిహితులున్నారు కూడా. అలాంటిది జాన్వీ, టాలీవుడ్‌లో ఇప్పట్లో సినిమాలు చేయలేననడం డిజప్పాయింట్‌ థింగ్‌ అనే చెప్పాలి. 

అయితే తొలి సినిమా 'ధడక్‌' ఆమెకు మంచి పేరు తెచ్చినా, కమర్షియల్‌గా అంచనాలకు తగ్గ విజయాన్ని ఆ సినిమా అందుకోకపోవడంతో, జాన్వీ బాలీవుడ్‌ సినిమాలపై ఇంకొంచెం ఎక్కువ ఫోకస్‌ పెట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే మైండ్‌ డైవర్ట్‌ అవకుండా తెలుగు సినిమాలకు ఇప్పట్లో సమయం కేటాయించలేనని చెప్పేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS