టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్న జాన్వీ.?

మరిన్ని వార్తలు

అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా అందరికీ ఆరాధ్య దేవత అయ్యింది. అయితే ఆమె కూతురు జాన్వీకపూర్‌కి అలాంటి గుర్తింపు పొందేందుకు ఇంకా చాలా టైం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యనే 'ధడక్‌' సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌తో తెరంగేట్రం చేసింది జాన్వీకపూర్‌. 

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. మరాఠీ సినిమా 'సైరత్‌'కి హిందీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్ల వసూళ్లు రాబట్టింది 'ధడక్‌' మూవీ. తొలి సినిమాకే ఈ స్థాయిలో పర్‌ఫామెన్స్‌తో, అందంతో ఆకట్టుకున్న జాన్వీ కపూర్‌ ప్రస్తుతం 'తఖ్త్‌' అనే ఓ పీరియాడిక్‌ మూవీలో నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జాన్వీ సౌత్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగులో ఓ సినిమా కోసం టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు జాన్వీతో సంప్రదింపులు చేస్తున్నారట. ఆల్రెడీ జాన్వీ ఓ తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. అలాగే తమిళంలోనూ ఓ సినిమాకి జాన్వీ ఒప్పుకుందట. ఒకవేళ ఇదే జరిగితే, తల్లి బాటలోనే జాన్వీ కూడా సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా, అన్ని భాషల్లోనూ తన టాలెంట్‌ ప్రదర్శించే అవకాశాలు లేకపోలేవు. 

చూడాలి మరి, జాన్వీ సౌత్‌ ఎంట్రీ ఎప్పుడో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS