APకి నందమూరి సోదరుల విరాళం

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాని తిత్లి తుఫాను తీవ్ర స్థాయిలో దెబ్బతీసింది. ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా అందులోనూ మరి ముఖ్యంగా ఉద్దానం ప్రాంతాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా చర్యలు మొదలయ్యాయి.

ఇక ఇందుకుగాను తెలుగు సినీ హీరోలు సైతం తమకి సాధ్యమనంత మేరలో ఆర్ధిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందచేస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం, ఎన్టీఆర్ రూ 15 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ 5 లక్షల ఆర్ధిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రకటించారు.

ఇప్పటికే సంపూర్నేష్ బాబు రూ 50.000/-, విజయ్ దేవేరకొండ రూ 5 లక్షలు ప్రకటించడం జరిగింది. ఈ హీరోలు ప్రకటించిన ఆర్ధిక సహాయం మరింతమందికి స్పూర్తిగా మారి పెద్ద ఎత్తున విరాళాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరి మరలా శ్రీకాకుళం జిల్లాని నిలబెట్టేందుకు ఉపయోగపడతుంది అన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది.

ఇంతటి మంచి పనికి సహాయం చేసిన ఈ హీరోలని అభినందించి తీరాల్సిందే...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS