కబడ్డీ ఆట కాదు వేట అంటోన్న యంగ్‌ టైగర్‌!

మరిన్ని వార్తలు

'కంట పడ్డావో కనికరిస్తానేమో.. వెంట పడ్డానో వేటాడేస్తానోబా..' అంటూ 'అరవింద సమేత'లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ గుర్తుంది కదా. ఇప్పుడు ఇలాంటి వేటాడే డైలాగే మరోసారి చెప్పారు ఎన్టీఆర్‌. అయితే ఈ సారి సినిమా కోసం చెప్పలా. కబడ్డీ కోసం చెప్పారు. అవునండీ త్వరలో ప్రారంభం కానున్న ప్రో కబడ్డీ లీగ్‌కి సంబంధించి ఎన్టీఆర్‌పై ఓ యాడ్‌ చిత్రీకరణ జరిపారు.

 

ఈ యాడ్‌లో ఎన్టీఆర్‌ చెబుతున్న డైలాగులు ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి. 'చూసేవారికి అది ఆటేనేమో.. కానీ ఆడేవారికి అది వేట..' అంటూ ఎన్టీఆర్‌ చెబుతున్న డైలాగ్‌ అదరగొట్టేస్తోంది. గతంలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఐపీఎల్‌కి సంబందించి ఇలాగే ఎన్టీఆర్‌ ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. అయితే, ఆ యాడ్‌ అంతగా క్లిక్‌ అవ్వలేదు. కానీ, చూస్తుంటే ఈ తాజా కబడ్డీ యాడ్‌ బాగా క్లిక్‌ అయ్యేలా ఉంది.

 

ప్రో కబడ్డీ 7 వ సీజన్‌ జూలై 20న ప్రారంభం కానుంది. మరోవైపు ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి విదేశీ టూర్‌ సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌కి ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లు ఇటీవల నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి కూడా విదితమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS