'కంట పడ్డావో కనికరిస్తానేమో.. వెంట పడ్డానో వేటాడేస్తానోబా..' అంటూ 'అరవింద సమేత'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు ఇలాంటి వేటాడే డైలాగే మరోసారి చెప్పారు ఎన్టీఆర్. అయితే ఈ సారి సినిమా కోసం చెప్పలా. కబడ్డీ కోసం చెప్పారు. అవునండీ త్వరలో ప్రారంభం కానున్న ప్రో కబడ్డీ లీగ్కి సంబంధించి ఎన్టీఆర్పై ఓ యాడ్ చిత్రీకరణ జరిపారు.
ఈ యాడ్లో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగులు ఫ్యాన్స్ని ఉర్రూతలూగిస్తున్నాయి. 'చూసేవారికి అది ఆటేనేమో.. కానీ ఆడేవారికి అది వేట..' అంటూ ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్ అదరగొట్టేస్తోంది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఐపీఎల్కి సంబందించి ఇలాగే ఎన్టీఆర్ ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. అయితే, ఆ యాడ్ అంతగా క్లిక్ అవ్వలేదు. కానీ, చూస్తుంటే ఈ తాజా కబడ్డీ యాడ్ బాగా క్లిక్ అయ్యేలా ఉంది.
ప్రో కబడ్డీ 7 వ సీజన్ జూలై 20న ప్రారంభం కానుంది. మరోవైపు ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి విదేశీ టూర్ సందర్భంగా ఈ సినిమా షూటింగ్కి ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు ఇటీవల నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి కూడా విదితమే.
#JrNTR Endorsing #vivoprokabaddi
— iQlik Movies (@iqlikmovies) July 6, 2019
Watch #ProKabaddi in #Telugu#TeluguTitans #BengaluruBulls #DabangDelhi #TamilThalaivas #UMumba
@tarak9999 pic.twitter.com/sYIjG7cAUV