కళాతపస్వికి ప్రధాని అభినందన

మరిన్ని వార్తలు

కళాతపస్వి కె విశ్వనాధ్ గారు నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించారు. ఈ సందర్బంగా యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకీ అభినందనలు తెలియచేస్తున్నది.

ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కళాతపస్వికి ఈ అవార్డు స్వీకరించిన నేపధ్యంలో శుభాకాంక్షలు తెలియచేశారు. 




ఇక అవార్డు అందుకున్న సందర్భంలో విశ్వనాధ్ గారు మాట్లాడుతూ- తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు అలాగే తన అభిమానులకి ఈ స్థాయికి ఎదిగేల చేసినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.

విశ్వనాధ్ గారికి అవార్డు రావడం నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక మరిచిపోలేని జ్ఞాపకం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS