అఖిల్‌ హీరోయిన్‌ అక్కడే సెటిలైపోయిందా?

మరిన్ని వార్తలు

అక్కినేని అఖిల్‌ తన తొలి రెండు సినిమాలతోనూ ఇద్దరు ముద్దుగుమ్మల్ని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. అయితే, రెండు సినిమాలూ హిట్‌ టాక్‌ తెచ్చుకోకపోవడంతో, ఆ ఇద్దరు భామలు టాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్‌ కాలేకపోయారు. మొదటి హీరోయిన్‌ సాయేషా సైగల్‌ అయితే, కేవలం ఒకే ఒక్క సినిమాకి పరిమితమైంది. సెకండ్‌ మూవీ హీరోయిన్‌ కళ్యాణి ప్రియదర్శన్‌ మాత్రం రెండు, మూడు సినిమాల్లో నటించింది. అందులో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌కి జోడీగా నటించిన ‘చిత్రలహరి’ మూవీతో హిట్‌ టేస్ట్‌ కూడా చవి చూసింది. అయినా, కళ్యాణికి టాలీవుడ్‌లో కన్నా, కోలీవుడ్‌లో ఎక్కువ గుడ్‌నేమ్‌ వచ్చింది. దాంతో, కళ్యాణి ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతోంది.

 

పాప వరస చూస్తుంటే, ఇక ఇప్పట్లో టాలీవుడ్‌కి వచ్చే అవకాశాలే కనిపించడ లేదు. యంగ్‌ హీరో శివకార్తికేయన్‌తో ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, సీనియర్‌ హీరో శింబు లేటెస్ట్‌ మూవీ ‘మానాడు’లో ఛాన్స్‌ కొట్టేసింది కళ్యాణి. వీటితో పాటు మరిన్ని తమిళ ప్రాజెక్టులు కళ్యాణి చేతిలో ఉన్నాయని సమాచారం. ఇకపోతే, అఖిల్‌ తొలి హీరోయిన్‌ సాయేషా సైగల్‌ కూడా తమిళంలోనే కెరీర్‌ని నిలదొక్కుకోగలిగింది. ఇకపోతే, మూడో హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ పరిస్థితి కూడా అంతే. తెలుగులో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రూపంలో ఓ సూపర్‌ హిట్‌ ఉన్నా, తెలుగులో కన్నా, తమిళంలోనే సత్తా చాటుతోంది. అఖిల్‌ వరస చూస్తుంటే, తన హీరోయిన్స్‌ అందరికి కోలీవుడ్లో మంచి ప్లాట్‌ఫామ్‌ సెట్‌ చేస్తున్నాడనిపిస్తోంది. వావ్‌.. వాట్‌ ఏ కో ఇన్సిడెంట్‌ కదా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS