కమల్‌హాసన్‌ని వేధిస్తున్నారట.

మరిన్ని వార్తలు

విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆరోపించారు విశ్వనటుడు కమల్‌హాసన్‌. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్‌-2’ సినిమా షూటింగ్‌ సందర్బంగా చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ముగ్గురి కుటుంబాలకు కమల్‌హాసన్‌ ఇప్పటికే కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.. తన తరఫున. మరో పక్క చిత్ర నిర్మాణ సంస్థ కూడా, బాధిత కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది.

 

కాగా, షూటింగ్‌ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు లేకపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్‌కి హాజరయ్యేది లేదని కమల్‌ హాసన్‌ తేల్చి చెప్పాడు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కమల్‌హాసన్‌ అక్కడే వున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారు. గతంలో విచారణకు హాజరైన కమల్‌హాసన్‌కి విచారణ నిమిత్తం పదే పదే పోలీసులు నోటీసులు ఇస్తున్నారట. అంతే కాకుండా, కమల్‌ని ఫోన్‌లో కొందరు వేధిస్తున్నారట. ఈ వేధింపులపై కమల్‌ ఫిర్యాదు కూడా చేశారు. రాజకీయ ఒత్తిళ్ళతోనే తనను వేధింపులకు గురిచేస్తున్నారన్నది కమల్‌ ఆరోపణ. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం పార్టీ పోటీ చేస్తోంది.

 

ఈ నేపథ్యంలోనే రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నాయన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కాగా, ఈ కేసులో హీరోయిన్లు కాజల్‌, రకుల్‌ ప్రీత్‌లనుఉ కూడా పోలీసులు విచారించే అవకాశం వుంది. శంకర్‌ కూడా ఇప్పటికే విచారణకు హాజరయ్యాడు ఓ సారి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS