కంగనా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అదేనట.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కి బాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అక్కడి స్టార్‌ హీరోలకు ధీటుగా కంగనా సినిమాలు ప్రదర్శితమవుతుంటాయి. బాక్సాఫీస్‌ వద్ద కాసుల పంట పండిస్తుంటాయి. లేటెస్ట్‌గా 'పంగా' సినిమాతో కంగనా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హిట్‌ టాక్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా. కబడ్డీ క్రీడాకారిణి పాత్రలో కంగనా నటించింది ఈ సినిమాలో. ఈ సినిమా కోసం కంగనా చాలా కష్టపడింది. ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత కంగనా 'తలైవి' చిత్రంలో నటిస్తోంది. ఇదీ ఓ సాహసోపేతమైన ప్రాజెక్ట్‌గానే చెప్పాలి. ఈ సినిమా కోసం చాలా బరువు పెరగాల్సి వచ్చింది కంగనా.

 

ఇటీవల విడుదలైన తలైవి ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి ప్రయోగానికి సిద్ధమవుతోందీ ఫైర్‌ బ్రాండ్‌. 'తేజస్‌' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. సైన్యం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆర్మీ పైలెట్‌గా కంగనా కనిపించబోతోందట. ఈ పాత్ర కోసం తనని తాను ప్రత్యేకంగా సిద్ధం చేసుకోవాలని చెబుతోంది. అంతేకాదు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పాత్ర ఇది.. నా డ్రీమ్‌ ఈ సినిమాతో నెరవేరబోతోంది.. అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది. 'తేజస్‌' అనే టైటిల్‌తో శర్వేష్‌ మేవరా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. జూలైలో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ లోగా 'తలైవి' షూటింగ్‌ పూర్తి చేయనుందట కంగనా రనౌత్‌. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతోన్న సినిమానే 'తలైవి'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS