కనికా కపూర్.. ఈ పేరు ఇంతవరకూ ఎంత మందికి తెలుసో తెలీదు కానీ, కరోనా కారణంగా ఈ పేరుకు తెగ పాపులారిటీ వచ్చేసింది. ఇటీవలే లండన్ నుండి ఇండియాకి వచ్చిన ఈ బాలీవుడ్ సింగర్ తన లగ్గేజ్ తో పాటు కరోనానీ మోసుకొచ్చింది. కరోనాతో వచ్చిన ఈమె కామ్గా ఉండకుండా, తనతో పాటు, ఇండియాలోని పెద్ద పెద్ద ప్రముఖులకీ అంటించేసింది. ఇండియా సంగతి ఇలా ఉంటే, అన్నింటికీ మించి బ్రిటన్ రాజు చార్లెస్ ప్రిన్స్తో కనికా కపూర్ చాటు మాటు వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా చర్చల్లోకి వచ్చింది. కనికాతో చార్లెస్కి ఆ టైప్ సంబంధాలేవో ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ కోడి కూతకు కారణం కరోనా.
ఈ ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలడం. ఈ వార్తకు బం చేకూరుస్తోంది. ఈ మధ్య కనికా, చార్లెస్ని కలిసి సరదాగా గడిపి వచ్చిందనీ అందుకే ఆయనకూ కరోనా అంటిందనీ, అది కనికా వల్లే అని అంటున్నారు. ఏ ముచ్చట కూడా పక్కన పెడితే ఇప్పుడు విషయం ఎలా తయారయ్యిందంటే, ప్రపంచం మొత్తానికి కరోనాని పరిచయం చేసింది కనికా కపూరే అన్నట్లుగా మారింది. అంతలా ఆమెపై ట్రోల్స్ జరుగుతున్నాయి. కరోనా తెచ్చిన తంటా, అనవసరంగా ఆ బ్రిటన్ రాజుతో కనికా కపూర్ అఫైర్ బయట పడిపోయింది. నిజంగానే ఆ బ్రిటన్ రాజుకీ, కనికాకీ అఫైర్ ఉందో లేదో తెలీదు కానీ, కరోనా హాలీడేస్లో భాగంగా, కనికా ఇష్యూ ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఇకపోతే, కరోనా సోకిన ఆ రాజు ఎలా ఉన్నాడో ఏమో కానీ, కనికా అయితే, లక్నోలో చికిత్స తీసుకుంటోంది. అది సంగతి.