రెండో పెళ్ళి పైన క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ భామ

మరిన్ని వార్తలు

ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక అదే క్రమంలో ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ కూడా తన భర్త నుండి గతంలో విడాకులు తీసుకుంది.

ఇక ఆ తరువాత ఆమె ముంబై కి చెందిన సందీప్ అనే బిజినెస్మెన్ తో ప్రేమలో పడింది అని త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ లో మీడియా కొడైకూసింది. దానికి తగ్గట్టుగానే వారిరువురు పలు చోట్ల కలిసి కనపడడం కూడా జరిగింది.

ఈ తరుణంలో కరిష్మా కపూర్ తండ్రి అయిన రణధీర్ కపూర్ ని ఇదే విషయమై మీడియా సంప్రదించగా- ఆమెని మరో పెళ్ళి చేసుకోమని తాను సలహా ఇచ్చాను అని అయితే తను మాత్రం మరోసారి పెళ్ళి చేసుకోను అని తేల్చి చెప్పిందట. ఇక ఆమె ఎవరితోనో కలిసి బయటకి వెళుతుంది అంటే తన కూతురు ఏమి చిన్న పిల్ల కాదు అని ఆమె తన స్నేహితులతో కలిసి బయటికి వెళితే తప్పేముంది అని చెప్పుకొచ్చాడు.

దీనితో కరిష్మా కపూర్ త్వరలోనే మళ్ళీ పెళ్ళి చేసుకోనుంది అన్న వార్తలకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగానే చెప్పొచ్చు. అయితే కరిష్మా మాత్రం ఈ వార్తల పైన ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS