బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. వాటిలో స్పోర్ట్స్ డ్రామాల హవానే ఎక్కువ. తాజాగా మరో క్రీడాకారిణి కథ తెరపై రాబోతోంది. తనే కరణం మల్లీశ్వరి. ఒలంపిక్స్లో భారత దేశం తరపున తొలి పతకం సాధించిన అథ్లైట్ కరణం మల్లీశ్వరి. సంజనా రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. కథ కోన వెంకట్ అందించారు. ఆయనే నిర్మాత కూడా. కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చింది.
కరణం మల్లీశ్వరి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది చిత్రబృందం చెప్పలేదు. అదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ పాత్ర కోసం ఇది వరకు భూమి పడ్నేకర్ ని ఎంచుకుందామనుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నారని తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు. కాబట్టి స్టార్ హీరోయిన్ ఉంటేనే ఈ కథకు న్యాయం జరుగుతుంది. తెలుగులో చాలామంది కథానాయికలతో కోనకు మంచి అనుబంధమే ఉంది. కోన అడిగితే ఎవరూ కాదనరు. సో.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నటించడం దాదాపు ఖాయమే.