రకుల్‌ - కార్తీ మళ్లీ మొదలెట్టేశారు

మరిన్ని వార్తలు

'ఖాకీ' చిత్రంలో కార్తీ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించారు. ఈ సినిమాలో ఈ ఇద్దరి మధ్యా ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ ఇండస్ట్రీ హాట్‌ టాపిక్‌ అయ్యింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. ఈ సినిమాకి 'దేవ్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. 

'ఖాకీ' చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించిన కార్తీ, 'దేవ్‌' కోసం గెటప్‌ మార్చనున్నాడట. మాస్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించబోతున్నాడట. యాక్షన్‌ ఎంటర్‌టైన్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్‌ అంటే అలాంటి ఇలాంటి యాక్షన్‌ కాదట. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్స్‌ చేయనున్నాడట కార్తీ. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ హైద్రాబాద్‌లో స్టార్ట్‌ అయ్యింది. 

తొలి షెడ్యూల్‌ షూటింగ్సే కార్‌ ఛేజింగ్స్‌తో మొదలైంది. చెన్నైలో నెక్ట్స్‌ షెడ్యూల్‌కి ప్లాన్‌ చేస్తోందట చిత్ర యూనిట్‌. తదుపరి యూరప్‌ తదితర విదేశీ లొకేషన్స్‌లో ఈ సినిమాని చిత్రీకరించనున్నారట. కార్తీ సోదరుడు సూర్య నటించిన 'సింగం 2' చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కట్టి పడేసే యాక్షన్‌ సీన్స్‌తో పాటు, ఆధ్యంతం నవ్వించే స్పెషల్‌ కామెడీ ట్రాక్‌ ఈ సినిమాలో ఉంటుందనీ చిత్ర యూనిట్‌ చెబుతోన్న మాట. 

ఇక ముద్దుగుమ్మ రకుల్‌ విషయానికి వస్తే, తమిళంలో ఒకేసారి అన్నదమ్ములతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తోందీ బ్యూటీ. సెల్వరాఘవన్‌ - సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఎన్‌జీకే' చిత్రంలో సూర్య సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS