బంగారు నాణాలు పంచిపెట్టిన అభినవ సావిత్రి

మరిన్ని వార్తలు

ఎప్పుడైతే కీర్తి సురేష్ తెరపైన సావిత్రి పాత్ర చేసిందో కాని అప్పటి నుండైతే ఆమె ఆ పాత్రలోనే లీనమైపోయినట్టుగానే కనిపిస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణగా ఒకటి చెప్పుకోవచ్చు.

అదేంటంటే- కీర్తి సురేష్ ఈమధ్యనే పందెం కోడి 2 చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఆ షూటింగ్ పూర్తయనరోజు ఆ యూనిట్ లో పని చేసినవారికి బంగారు నాణాలు ఇచ్చింది. ఒకప్పుడు మహానటి సావిత్రి కూడా ఇదే తరహాలో యూనిట్ సభ్యులకి ఇటువంటి ఖరీదైన బహుమతులు ఇచ్చేది అని మనం విన్నాము అది ఆ మహానటి చిత్రంలో కూడా చూసాము.

ఇక ఇప్పుడు ఆమె పాత్ర ప్రభావమో ఏమో కాని కీర్తి సురేష్ కూడా దాదాపు అదే బాటలో తన సినిమాకి పనిచేసినవారికి ఇలా ఇవ్వడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె ఇలా చేసింది అంటే ఆమెది ఎంత గొప్ప మనసు అని అంటున్న వారు కూడా లేకపోలేదు.

ఇది ఈ అభినవ మహానటి తాజా కబుర్లు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS