మహేష్బాబు తదుపరి సినిమా ఏమిటన్న విషయంలో ఓ స్పష్టత వచ్చేసింది. పరశురామ్తో మహేష్ సినిమా చేయబోతున్నారు. మేలో ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. ఈ యేడాది చివర్లో షూటింగ్ పూర్తి చేసి, 2021 ప్రధమార్థంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ సాగుతోంది. ఆ ఛాన్స్ మహానటి కీర్తి సురేష్కి దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహేష్ - కీర్తి సురేష్లు ఇప్పటి వరకూ కలిసి నటించలేదు. సో.. ఇది ఫ్రెష్ కాంబినేషన్ అయ్యే ఛాన్సుంది.
అయితే మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సివుంది. కథానాయికల విషయంలో మహేష్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ విషయంలో నమ్రత సలహాలు తీసుకుంటాడు. నిజానికి మహేష్ సినిమాలో కథానాయికల ఎంపికపై పూర్తి ఆధిపత్యం నమ్రత చేతుల్లోనే ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తుంటాయి. మరి... తన నుంచి కూడా అప్రువల్ వచ్చేస్తే.. మహర్షి పక్కన మహానటిని చూసేయొచ్చు.