కన్నడ మూవీ 'కేజీఎఫ్' గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదేమో. పరభాషా చిత్రమైనా, 'బాహుబలి' తర్వాత అంత ఎక్కువగా మాట్లాడుకున్న చిత్రమిది. బాహుబలి మాదిరిగానే తెలుగు, హిందీ తదితర భాషల్లో విడుదలై సంచలన విజయం అందుకుంది. కన్నడ సినీ పరిశ్రమ గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఈ సినిమాకి వచ్చిన హైప్తో సీక్వెల్ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ కన్నా మించిన బడ్జెట్తో, ఆసక్తికరమైన కథా, కథనాలతో రెండో పార్ట్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
అయితే, ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కొంత గందరగోళం నెలకొన్నట్లు తాజా సమాచారం. ఏంటా గందరగోళం.? అంటే, తొలి షాట్ రోజే సినిమా రిలీజ్ టైమ్ కూడా ప్రకటించింది చిత్ర యూనిట్. 2020 సమ్మర్కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కాన్ఫిడెన్స్ చూపించింది. కానీ, ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు చిత్ర యూనిట్లో కనిపించడం లేదనేది కన్నడ ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న న్యూస్. మరి రిలీజ్ డేట్ ఎప్పుడూ.? అంటే ఆగస్ట్ 15 అంటూ మరో న్యూస్ కొత్తగా తెరపైకి వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తే బావుంటుందని భావిస్తున్నారట. అయితే, అప్పటికైనా సినిమా నిర్మాణం పూర్తవుతుందా.? చూడాలి మరి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్దత్ ఈ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.