'బాహుబలి' సినిమా తర్వాత ఆ స్థాయిలో అందరి నోటిలోనూ నానిన సినిమా 'కేజీఎఫ్'. కన్నడ నటుడు యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. 200 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. అన్ని సౌత్ భాషలతో పాటు, నార్త్లోనూ ఈ సినిమా గురించి మాట్లాడుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా భారీ మొత్తంలో భారీ వసూళ్లు కొల్లగొట్టింది 'కేజీఎఫ్' చిత్రం. ఆ జోష్తో అంతకు మించిన భారీ బడ్జెట్తో ఈ సినిమాకి 'కేజీఎఫ్ 2' అనే టైటిల్తో సీక్వెల్ రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో యష్కి విలన్గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్దత్ నటిస్తున్నాడు. తొలి పార్ట్లో హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టి ఈ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా నుండి విలన్ అధీరా (సంజయ్దత్) గెటప్ని ఆల్రెడీ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న 'కేజీఎఫ్ 2' ఫస్ట్లుక్ని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారట. ఈ డేట్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇదేరోజు 'కేజీఎఫ్' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించింది. అందుకే అదే సెంటిమెంట్తో అదే రోజు ఈ సినిమా ఫస్ట్లుక్ రిలీజ్ చేయబోతున్నామని 'కేజీఎఫ్ 2' టీమ్ లేటెస్ట్గా ప్రకటించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వారాహి చలనచిత్ర బ్యానర్ సమర్పణలో 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' రూపొందుతోంది.