ఓ వసుమతీ.. అలా అనేసిందేంటీ?

మరిన్ని వార్తలు

ఓ వసుమతీ.. అంటూ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో రాగాలు పలికించిన దేవదారు శిల్పం కియారా అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ ఫుల్‌ రైజింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడయితే టాలీవుడ్‌లో అడుగుపెట్టిందో నేటివ్‌ ప్లేస్‌లో కూడా క్రేజ్‌ దక్కించుకుంది. హిట్టిచ్చిన టాలీవుడ్‌లో కన్నా, బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు ఓకే చేస్తోందీ అమ్మడు. అతి త్వరలోనే 'కబీర్‌సింగ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కియారా అద్వానీ, ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటోంది. అందులో భాగంగానే హిట్టొస్తేనే హీరోయిన్స్‌ వెంట పడతారు. హిట్టు లేకుంటే ఎంత టాలెంట్‌ ఉన్నా పక్కన పడేస్తారు.. 'భరత్‌ అనే నేను'తో హిట్‌ దక్కింది కాబట్టే, నా వెంట పడుతున్నారు.

 

ఇన్ని అవకాశాలిస్తున్నారు.. అని వ్యాఖ్యానించింది అందాల కియరా. అయితే, ఓ స్టార్‌ హీరోయిన్‌ ఇలా మాట్లాడడం తగదేమో. కానీ, ప్రస్తుతం కియారా ఏం చేసినా కరెక్టే అనేలా ఉంది. ఆ రేంజ్‌లో ఆమెకు ఇమేజ్‌ ఉంది మరి. బాలీవుడ్‌లో మూడు, నాలుగు బడా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. అవకాశమొస్తే, టాలీవుడ్‌లోనూ ఛాన్స్‌ వదులుకోనంటోంది. అయితే, బాలీవుడ్‌లో ఒక్క సినిమాలో నటిస్తేనే, ఇతర భాషల్లో సినిమాలు చేయడం కుదరదు. కానీ, తనకి హిట్‌ కట్టబెట్టిన టాలీవుడ్‌ కోసం కొంచెం కష్టమైనా ఇష్టంగా భావిస్తానంటోంది కియరా అద్వానీ. ఇప్పటికే తెలుగులో ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌ చర్చల దశలో ఉందని చెబుతోంది కానీ, ఆ ప్రాజెక్ట్‌ ఏంటీ.? హీరో ఎవరనే విషయం మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS