రీమేక్‌ ఓకే.. మరి ఒరిజినల్‌ సంగతేంటీ.!

మరిన్ని వార్తలు

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కొలైయుధీర్‌ కాలం' అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మధ్య కామన్‌గా ఎదురవుతున్న వివాదాలే ఈ సినిమాకీ చుట్టుముట్టాయి. ఏముంది.. టైటిల్‌ నాదంటారు, కథ నాదంటారు.. ఇలాంటివన్నమాట. అలాగే నయనతార సినిమా టైటిల్‌ హక్కులు నావి అంటూ బాలాజీ మోహన్‌ అనే వ్యక్తి మద్రాస్‌ హైకోర్టులో కేసు వేశారు. 10 లక్షలు పెట్టి ఈ టైటిల్‌ హక్కులు సొంతం చేసుకున్నాననీ, ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఈ నెల 14న విడుదల కానున్న ఈ సినిమా వాయిదా పడే అవకశాలున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌.

 

ఈ చిత్రం విడుదలపై తాత్కాలిక స్టే విధిస్తూ, ఈ వ్యవహారంపై ఈ నెల 21న వివరణ ఇవ్వాలంటూ చిత్ర నిర్మాతకు ఆదేశాలు జారీ చేసింది మద్రాసు హైకోర్టు. అలా ఈ సినిమా విడుదల ప్రస్తుతానికి సస్పెన్స్‌లో పడింది. ఒరిజినల్‌ మూవీ అయిన ఈ సినిమా సంగతిలా ఉంటే, ఇదే సినిమాని హిందీలో తమన్నా ప్రధాన పాత్రలో రీమేక్‌ చేస్తున్నారు. 'ఖామోషి' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటిస్తున్నాడు. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అది. తెలుగులోకి ఇదే పేరు ('ఖామోషి')తో డబ్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రం ఆశక్తి రేకెత్తించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న 'ఖామోషి' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS