టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితా తీస్తే, అందులో కొరటాల శివ పేరు తప్పకుండా ఉంటుంది. వరుసగా అన్నీ హిట్లే. పైగా ఒకదాన్ని మించి మరో విజయం. ఇప్పుడు చిరంజీవితో `ఆచార్య` సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత.. అల్లు అర్జున్ తోనూ ఓ సినిమా ఓకే అయ్యింది. బన్నీ సినిమాకి కొరటాల ఊహించని పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. `ఆచార్య`కు కొరటాల పారితోషికం 15 కోట్లయితే... మరో అయిదు పెంచి.. బన్నీసినిమాకి 20 కోట్లు అడిగాడట. అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలుకూడా రెడీ అయిపోయారు.
నిజానికి కొరటాలకు అంత క్రేజ్ ఉంది కూడా. కొరటాల శివ సినిమా అనగానే, హీరోతో పని లేకుండా బిజినెస్ మొదలైపోతోంది. ఆయనపై నమ్మకం అలాంటిది. కాకపోతే.. 20 కోట్ల రెమ్యునరేషన్ మాత్రం ఊహించలేనిదే. త్రివిక్రమ్ కూడా దాదాపు ఇంతే తీసుకుంటున్నాడు. టాలీవుడ్ లో అందరి కంటే ఎక్కువ పారితోషికం రాజమౌళిదే. ఆ తరవాత స్థానం త్రివిక్రమ్ - కొరటాల, సుకుమార్లకు దక్కుతుంది. దర్శకులే ఇరవై కోట్లు, 30 కోట్లు తీసుకుంటుంటే, హీరోలు తీసుకోవడంలో తప్పేముంది?