క్రిష్‌ ట్రాక్‌ ఎక్కేశాడుగా!

మరిన్ని వార్తలు

ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్న నానుడిని క్రిష్‌ నిజం చేయాలనుకుంటున్నాడు కాబోలు. ఈ మధ్య బాలీవుడ్‌లో క్రిష్‌ తెరకెక్కించిన 'మణికర్ణిక' వివాదంతో చాలా మనస్తాపానికి గురి అయిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా తెలుగులో ఆయన డైరెక్ట్‌ చేసిన 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ రెండు భాగాలు కూడా ఆదరణ దక్కించుకోకపోవడంతో క్రిష్‌ తన ఉనికిని చాటుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

అయితే, టాలీవుడ్‌ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు క్రిష్‌ ఫోకస్‌ అంతా బాలీవుడ్‌ పైనే అని తెలుస్తోంది. ఎంతో ఇష్టపడి, ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'మణికర్ణిక'తో క్రిష్‌ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. దాంతో బాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్నాడట. గతంలో క్రిష్‌ తెరకెక్కించిన 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌' చిత్రం మంచి విజయం అందుకుంది.

 

అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. క్రిష్‌కి మంచి గుర్తింపు దక్కించింది. అందుకే అదే అక్షయ్‌ కుమార్‌తో మళ్లీ సినిమాకి క్రిష్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఆల్రెడీ కథ కూడా సిద్ధమైందనీ, ఆ కథకు అక్షయ్‌ ఓకే చేశారనీ టాక్‌ నడుస్తోంది. అంటే త్వరలోనే క్రిష్‌, అక్షయ్‌కుమార్‌తో కలిసి బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారన్నమాట. మరోవైపు టాలీవుడ్‌లో ఓ అగ్రహీరోతోనూ క్రిష్‌ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ విషయమై కూడా స్పష్టత ఇవ్వనున్నారట క్రిష్‌. మొత్తానికి ఇదంతా చూస్తుంటే, క్రిష్‌ లేటైనా, లేటెస్ట్‌గా ట్రాక్‌ ఎక్కేలానే ఉన్నారు చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS