దూసుకొస్తున్న కెరటంలా మహేష్‌ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

'వన్‌ - నేనొక్కడినే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ కృతిసనన్‌. తెలుగులో తొలి సినిమాతోనే నిరాశపరిచింది. చాలా ఆశలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ, ఒకటీ, రెండు సినిమాలకే పరిమితమైంది ఈ పొడుగు కాళ్ల సుందరి. నిజానికి బాలీవుడ్‌లో ఫెయిల్యూర్స్‌ చవి చూశాకే టాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంది. ఇక్కడ కూడా బెడిసికొట్టడంతో కాస్త డిజప్పాయింట్‌ అయిన కృతి తిరిగి బాలీవుడ్‌నే నమ్ముకుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కెరీర్‌ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడింది.

 

కష్టపడితే, ఖచ్చితంగా ఫలితం దక్కుతుందనడానికి కృతి సనన్‌ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. ఇటీవల బాలీవుడ్‌లో రెండు సూపర్‌ డూపర్‌ హిట్లు కృతి సనన్‌ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం కృతి సనన్‌ చేతిలో ఉంది. అదే 'పానిపట్‌'. పానిపట్టు యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కృతి సనన్‌ పార్వతీ భాయ్‌ అనే మరాఠీ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రలో కృతి ఒదిగిపోయిన తీరు చూసి బాలీవుడ్‌ జనం అవాక్కవుతున్నారు. 'హెడ్‌లైట్స్‌ లేవు.. బంపర్‌ లేదు..' ఇలాంటి అమ్మాయి హీరోయిన్‌ ఏంటీ?అని ఓ తోటి బాలీవుడ్‌ నటితో జుగుప్సాకరమైన కామెంట్స్‌ ఫేస్‌ చేసింది కృతి సనన్‌ గతంలో. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా స్టార్‌డమ్‌ దక్కించుకుంటోంది.

 

పార్వతీ భాయ్‌ పాత్ర తన కెరీర్‌లో ది బెస్ట్‌ అని చెప్పుకుంటోంది. అలాంటి పాత్ర దక్కడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నానని మురిసిపోతోందీ గుజరాతీ అమ్మాయి. అర్జున్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ కీలక భూమిక పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS