డ్రగ్స్ కేసు ముగిసినట్టేనా?!

మరిన్ని వార్తలు

ఈ ఏడాది మధ్యలో డ్రగ్స్ రాకెట్ ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.  ఇక ఈ రాకెట్ లో సినీ ప్రముఖులకి సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు రావడం, Excise శాఖ కూడా దాదాపు 10మందికి పైగా ప్రముఖులని విచారణకి పిలవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ అంశానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. మీడియా సైతం ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రసారం చేసింది. అయితే ప్రస్తుతం ఈ విచారణలో ఎటువంటి సమాచారం కాని కేసు నమోదు చేసే ఆధారాలు లబించలేదు అని సమాచారం.

దీనితో విచారణ సమయంలో ఈ కేసుకి సంబంధించి వచ్చిన హైప్ కి ఇప్పుడు విచారణ పూర్తయ్యే సమయానికి చాలా తేడా వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే పోలీసులు ఈ కేసు కి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

ఏదేమైనా తీవ్ర ఆసక్తి రేపిన ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS